ఎయిర్ ఇండియా విమాన సేవలకు అంతరాయం
- April 27, 2019ఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సేవలకు అంతరాయం ఏర్పడింది. సర్వర్ డౌన్ కారణంగా శనివారం ఉదయం నుంచి సర్వీసులు స్తంభించిపోయాయి. దీంతో వివిధ విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. అలాగే అనేక విమానాలు నిర్దేశిత సమయం కంటే ఆలస్యంగా బయలుదేరనున్నాయి. దీంతో దిల్లీ, ముంబయి విమానాశ్రయాలు ప్రయాణికులతో రద్దీగా మారినట్లు సమాచారం. దీనిపై ప్రయాణికులు సామాజిక మాధ్యమాల వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ''ఎస్ఐటీఏ సర్వర్ డౌన్ అయింది. ఇప్పటికే సాంకేతిక నిపుణులు రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించే ప్రయత్నాల్లో ఉన్నారు. త్వరలోనే సేవలు ప్రారంభమవుతాయి. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము'' అని తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి