ఎయిర్ ఇండియా విమాన సేవలకు అంతరాయం
- April 27, 2019
ఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సేవలకు అంతరాయం ఏర్పడింది. సర్వర్ డౌన్ కారణంగా శనివారం ఉదయం నుంచి సర్వీసులు స్తంభించిపోయాయి. దీంతో వివిధ విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. అలాగే అనేక విమానాలు నిర్దేశిత సమయం కంటే ఆలస్యంగా బయలుదేరనున్నాయి. దీంతో దిల్లీ, ముంబయి విమానాశ్రయాలు ప్రయాణికులతో రద్దీగా మారినట్లు సమాచారం. దీనిపై ప్రయాణికులు సామాజిక మాధ్యమాల వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ''ఎస్ఐటీఏ సర్వర్ డౌన్ అయింది. ఇప్పటికే సాంకేతిక నిపుణులు రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించే ప్రయత్నాల్లో ఉన్నారు. త్వరలోనే సేవలు ప్రారంభమవుతాయి. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము'' అని తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







