'సాహో' సెట్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
- April 27, 2019
ముంబయి: ప్రభాస్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ 'సాహో'. శ్రద్ధాకపూర్ కథానాయిక. ప్రస్తుతం ముంబయిలో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 'సాహో' బృందాన్ని కలిశారు. ప్రభాస్, శ్రద్ధాకపూర్, సుజీత్లతో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న 'సాహో'ను ఆగస్టు 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన రెండు టీజర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ నిర్మిస్తున్నారు. శంకర్-ఎషెహన్-లాయ్లు సంగీతం సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంగా విడుదల కానుంది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







