'సాహో' సెట్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
- April 27, 2019
ముంబయి: ప్రభాస్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ 'సాహో'. శ్రద్ధాకపూర్ కథానాయిక. ప్రస్తుతం ముంబయిలో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 'సాహో' బృందాన్ని కలిశారు. ప్రభాస్, శ్రద్ధాకపూర్, సుజీత్లతో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న 'సాహో'ను ఆగస్టు 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన రెండు టీజర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ నిర్మిస్తున్నారు. శంకర్-ఎషెహన్-లాయ్లు సంగీతం సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంగా విడుదల కానుంది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







