పోలీసుల అదుపులో RGV
- April 28, 2019ఎప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటూ తనడైన శైలిలో దూసుకుపోతుంటారు రామ్ గోపాల్ వర్మ. ఇటీవల ఆయన నిర్మించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రానికి గాను నందమూరి అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. ఆ సినిమాను తెలంగాణలో విడుదల చేసినప్పటికీ.. ఆంధ్రప్రదేశ్లో వాయిదా వేశారు. ఈ క్రమంలో కోర్టు ఒకే చెప్పడంతో మే 1వ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా విడుదల చేయనున్నామని ప్రకటించారు వర్మ.
ఈ మేరకు నేడు (ఆదివారం సాయంత్రం) విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో ప్రెస్మీట్ పెట్టాలని నిర్ణయించారు. అయితే హోటల్ యాజమాన్యం అనుమతి నిరాకరించడంతో నడి రోడ్డుపైనే ప్రెస్మీట్ పెడతానంటూ సంచలన ప్రకటన చేశారు.దీంతో అప్రమత్తమైన పోలీసులు వర్మ ప్రకటన మరి శృతిమించిందని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదనే కారణంగా రామ్ గోపాల్ వర్మను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్