120,000 అక్రమ వలసదారుల కోసం వేట
- April 29, 2019కువైట్:దేశంలో 120,000 మంది వలసదారులు అక్రమంగా నివసిస్తున్నారనే అంచనాలతో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ఆయా వ్యక్తుల జాడ కనుగొనేందుకు సంబంధిత శాఖల ద్వారా 'వేట' కొనసాగిస్తోంది. ఉల్లంఘనుల్లో కొందరు తమ రెసిడెన్స్ పర్మిట్ని వివిధ కారణాలతో రెన్యూ చేసుకోలేకపోయినట్లు మినిస్ట్రీ భావిస్తోంది. అలాగే మరికొందరు విజిట్ వీసాలపై వచ్చి, ఆ తర్వాత గడువు తీరినా దేశం విడిచి వెళ్ళకుండా వుండిపోయినట్లు పేర్కొంటున్నారు అధికారులు. అయితే, ఏ కారణాలతో అయినా అక్రమ నివాసితులుగా వున్నవారిని అరెస్ట్ చేయడం తప్పనిసరి అని మినిస్ట్రీ చెబుతోంది. కాగా, డిపార్ట్మెంట్ ఆఫ్ డిపోర్టేషన్ గత కొద్ది రోజుల్లో 620 మంది వలసదారుల్ని డిపోర్ట్ చేయడం జరిగింది. వీరిలో 18 మంది మహిళలు వున్నారు. డిపోర్టేషన్ సెంటర్ కెపాసిటీ 800 మంది మాత్రమే.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!