ముగిసిన ఫార్మర్స్ మార్కెట్
- April 29, 2019
బహ్రెయిన్:ఏడవ ఎడిషన్ ఫార్మర్ మార్కెట్ బుడైయాలో ముగిసింది. ఐదు నెలలపాటు ఈ మార్కెట్ జరిగింది. రైతులు, తమ వ్యవసాయ భూముల్లో పండించిన వ్యవసాయ ఉత్పత్తుల్ని ఇక్కడ ప్రదర్శన మరియు అమ్మకానికి వుంచారు. ప్రతి వారం పెద్ద సంఖ్యలో సందర్శకులు ఈ ఫార్మర్స్ మార్కెట్ని సందర్శించి, వ్యవసాయ ఉత్పత్తుల గురించి తెలుసుకుని, వాటిని కొనుగోలు చేశారు. మినిస్ట్రీ ఆఫ్ మునిసిపల్ ఎఫైర్స్, అగ్రికల్చర్ అండ్ అర్బన్ ప్లానింగ్తో కలిసి నేషనల్ ఇనీషియేటివ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ఈ మార్కెట్ని నిర్వహించింది. డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు ప్రతి యేడాదీ ఈ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 40 మంది వరకు రైతులు ఈ మార్కెట్లో పాల్గొన్నారు. అగ్రికల్చర్ ప్రోడక్ట్స్తోపాటు ఈసారి ట్రెడిషనల్ క్రాఫ్ట్స్, రెస్టారెంట్స్, ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మార్కెట్లో రకరకాల ఫెస్టివల్స్ని కూడా నిర్వహించడం గమనార్హం. మల్బరీ ఫెస్టివల్ ఈ ఏడాది ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







