ముగిసిన ఫార్మర్స్ మార్కెట్
- April 29, 2019
బహ్రెయిన్:ఏడవ ఎడిషన్ ఫార్మర్ మార్కెట్ బుడైయాలో ముగిసింది. ఐదు నెలలపాటు ఈ మార్కెట్ జరిగింది. రైతులు, తమ వ్యవసాయ భూముల్లో పండించిన వ్యవసాయ ఉత్పత్తుల్ని ఇక్కడ ప్రదర్శన మరియు అమ్మకానికి వుంచారు. ప్రతి వారం పెద్ద సంఖ్యలో సందర్శకులు ఈ ఫార్మర్స్ మార్కెట్ని సందర్శించి, వ్యవసాయ ఉత్పత్తుల గురించి తెలుసుకుని, వాటిని కొనుగోలు చేశారు. మినిస్ట్రీ ఆఫ్ మునిసిపల్ ఎఫైర్స్, అగ్రికల్చర్ అండ్ అర్బన్ ప్లానింగ్తో కలిసి నేషనల్ ఇనీషియేటివ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ఈ మార్కెట్ని నిర్వహించింది. డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు ప్రతి యేడాదీ ఈ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 40 మంది వరకు రైతులు ఈ మార్కెట్లో పాల్గొన్నారు. అగ్రికల్చర్ ప్రోడక్ట్స్తోపాటు ఈసారి ట్రెడిషనల్ క్రాఫ్ట్స్, రెస్టారెంట్స్, ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మార్కెట్లో రకరకాల ఫెస్టివల్స్ని కూడా నిర్వహించడం గమనార్హం. మల్బరీ ఫెస్టివల్ ఈ ఏడాది ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







