ఉగ్రదాడులపై శ్రీలంక కీలక నిర్ణయం
- April 29, 2019ఉగ్రదాడుల నేపథ్యంలో శ్రీలంక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎవరూ ముఖాలు కప్పుకోరాదని అధ్యక్ష కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖానికి ముసుగు ధరించడం ద్వారా తమ ఐడెంటిటీని దాచడానికి ప్రయత్నించకూడదని ఆదేశాల్లో పేర్కొంది. సోమవారం నుంచే ఈ నిబంధన వర్తిస్తుందని అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కార్యాలయం పేర్కొంది. అత్యవసర నిబంధనల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్న అధ్యక్షుడు ప్రజా రక్షణ కోసమే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, దాడుల ప్రభావం ఈ ఆదివారం కూడా కనిపించింది. చర్చ్ లన్నీ బోసిపోయి కనిపించాయి. ప్రార్థనల కోసం చర్చ్ లకు వచ్చేందుకు జనాలు భయపడ్డారు. కల్మునై, సమంథురై, చవలకడె ప్రాంతాల్లో కర్ఫ్యూ ఎత్తివేసినప్పటికీ ఎవరూ చర్చ్ లవైపు రావడానికి సాహసించలేదు. మరోవైపు అనుమానిత ఉగ్రవాదుల కోసం ఆర్మీ బలగాలు దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో అహ్మద్ అనే అనుమానిత ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్న భద్రతా దళాలు అతడి నుంచి ఉగ్ర సాహిత్యం, జర్మన్ తయారీ ఎయిర్గన్, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్