ఉగ్రదాడులపై శ్రీలంక కీలక నిర్ణయం
- April 29, 2019ఉగ్రదాడుల నేపథ్యంలో శ్రీలంక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎవరూ ముఖాలు కప్పుకోరాదని అధ్యక్ష కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖానికి ముసుగు ధరించడం ద్వారా తమ ఐడెంటిటీని దాచడానికి ప్రయత్నించకూడదని ఆదేశాల్లో పేర్కొంది. సోమవారం నుంచే ఈ నిబంధన వర్తిస్తుందని అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కార్యాలయం పేర్కొంది. అత్యవసర నిబంధనల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్న అధ్యక్షుడు ప్రజా రక్షణ కోసమే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, దాడుల ప్రభావం ఈ ఆదివారం కూడా కనిపించింది. చర్చ్ లన్నీ బోసిపోయి కనిపించాయి. ప్రార్థనల కోసం చర్చ్ లకు వచ్చేందుకు జనాలు భయపడ్డారు. కల్మునై, సమంథురై, చవలకడె ప్రాంతాల్లో కర్ఫ్యూ ఎత్తివేసినప్పటికీ ఎవరూ చర్చ్ లవైపు రావడానికి సాహసించలేదు. మరోవైపు అనుమానిత ఉగ్రవాదుల కోసం ఆర్మీ బలగాలు దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో అహ్మద్ అనే అనుమానిత ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్న భద్రతా దళాలు అతడి నుంచి ఉగ్ర సాహిత్యం, జర్మన్ తయారీ ఎయిర్గన్, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్