'ఫోని' తుఫాన్ హెచ్చరికలు : ఎదుర్కొనేందుకు భారత్ ఆర్మీ రెడీ
- April 30, 2019'ఫోని' తుఫాన్ హెచ్చరికలతో అధికారగణం సర్వం సిద్ధమయ్యింది. దీని ప్రభావంతో ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో 'ఫోని' తుఫాన్ హెచ్చరికలతో ప్రజలకు సేవలందించేందుకు భారత సైన్యం సమాయత్తమైంది.
తుఫాన్ వల్ల భారీ వర్షాలతోపాటు వరదలు వెల్లువెత్తి, భారీ గాలులు వీచే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరికలతో భారత నావికాదళం, భారత వైమానిక దళాలు అప్రమత్తమై తమ నౌకలు, హెలికాప్టర్లను సిద్ధం చేశాయి. తమిళనాడు రాష్ట్రంలోని అరక్కోణం తీరంలో ఐఎన్ఎస్ రాజాలీ నౌక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ తీరంలో ఐఎన్ఎస్ డేగ నౌకలను కేంద్రం రంగంలోకి దించింది. తుఫాన్ బారిన పడిన ప్రజలను కాపాడేందుకు వీలుగా హెలికాప్టర్లను సైతం సిద్ధం చేశారు. తుఫాన్ బాధితులను అన్ని విధాలా ఆదుకునేందుకు రబ్బరు పడవలు, పునరావాస పరికరాలు, ఆహార సామాగ్రిని సిద్ధంగా ఉంచారు. వైద్యానికి కావాల్సిన అన్ని రకాల చర్యల్ని సిద్ధం చేశారు. ఈ క్రమంలో డాక్టర్లతోపాటు కావాల్సిన మెడిసిన్స్ ఔషధాలను కూడా భారత సైన్యం సిద్ధం చేసింది.
తాజా వార్తలు
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి