ఐసిస్ చీఫ్ అబూ బకర్ జిందా హై
- April 30, 2019ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఐసిస్ ఉగ్రవాద సంస్థ ఛీప్ అబూ బకర్ అల్ బాగ్దాది బతికే ఉన్నాడు. దాదాపు 5 సంవత్సరాల తర్వాత అతను ఒక వీడియోలో కనిపించాడు. సిరియాలో పాతుకుపోయిన ఐసిస్ సంస్థను 2014లో అక్కడి సైన్యం తరిమికొట్టింది. అప్పుడు జరిగిన బాంబు దాడులలో అబూ బకర్ మృతి చెందినట్టు వార్తలు వచ్చాయి. అయితే.. అప్పటి నుంచీ కనిపించకుండా పోయిన వ్యక్తి తాజాగా ప్రత్యక్షమైన ఈ వీడియోలో దర్శనమిచ్చాడు.
ఒక గదిలో ప్రశాంతంగా కుర్చున్న అబూ బకర్ ఇటీవల శ్రీలంకలోని చర్చిలు, హోటళ్ల దాడులు, ఆత్మాహుతి దాడులపై మాట్లాడాడు. ఈ సందర్భంగా.. ఐసిస్ ఉగ్రవాద సంస్థలో ఉన్న వారిని అభినందించాడు. శ్రీలంకలో జరిగిన మారణకాండలో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఐదేళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్న అబూ బకర్ శ్రీలంక పేలుళ్ల తర్వాత వీడియోలో కనిపించడం ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది.
కాగా.. ఈ వీడియోలో అబూ బకర్ కేవలం 40 సెకన్ల పాటు మాత్రమే మాట్లాడాడు. ఇస్లాం మతం కోసం తమ పోరాటం కొనసాగుతుందని.. ఇస్లాములపై దాడులకు, హింసాత్మక చర్యలకు మూల్యం తప్పదని వీడియోలో హెచ్చరించాడు. అయితే.. ప్రస్తుతం ఈయన ఏ దేశంలో ఉన్నాడనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన