మే 2న తెలంగాణ బంద్
- April 30, 2019
తెలంగాణలో ఇంటర్ బోర్డు అరాచకాలపై ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. వచ్చే నెల రెండో తేదీ వరకు పోరాటం కొనసాగిస్తామని అఖిలపక్ష నాయకులు స్పష్టంచేశారు. ప్రభుత్వం ఎంతగా నిర్బంధానికి పాల్పడినా.. తొలిరోజు ధర్నా విజయవంతం అయిందన్నారు. మే ఒకటో తేదీన కొవ్వుత్తుల ర్యాలీకి అఖిలపక్షం ప్లాన్ చేసింది. చనిపోయిన విద్యార్థులకు ట్యాంక్బండ్పై నివాళి అర్పించనున్నారు. మరణించిన ప్రతి విద్యార్థి కుటుంబాన్ని కలుస్తామని నేతలు చెప్పారు.
బీజేపీ కార్యాలయంలో నిన్న దీక్షకు దిగిన ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ను.. పోలీసులు అరెస్టు చేసి.. బలవంతంగా నిమ్స్కు తరలించారు. వైద్యం తీసుకునేందుకు నిరాకరించిన ఆయన.. నిరశన కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఇవాళ ప్రగతి భవన్ ముట్టడికి కమలనాథులు కదలనున్నారు. మే 2న తెలంగాణ బంద్కు లక్ష్మణ్ పిలుపిచ్చారు. ఇంటర్ ఫలితాల్లో గందరగోళంపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించి.. భవిష్యత్లో రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అటు ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్టూడెంట్ యూనియన్ల నిరసనలు కొనసాగుతున్నాయి. అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







