మే 2న తెలంగాణ బంద్
- April 30, 2019తెలంగాణలో ఇంటర్ బోర్డు అరాచకాలపై ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. వచ్చే నెల రెండో తేదీ వరకు పోరాటం కొనసాగిస్తామని అఖిలపక్ష నాయకులు స్పష్టంచేశారు. ప్రభుత్వం ఎంతగా నిర్బంధానికి పాల్పడినా.. తొలిరోజు ధర్నా విజయవంతం అయిందన్నారు. మే ఒకటో తేదీన కొవ్వుత్తుల ర్యాలీకి అఖిలపక్షం ప్లాన్ చేసింది. చనిపోయిన విద్యార్థులకు ట్యాంక్బండ్పై నివాళి అర్పించనున్నారు. మరణించిన ప్రతి విద్యార్థి కుటుంబాన్ని కలుస్తామని నేతలు చెప్పారు.
బీజేపీ కార్యాలయంలో నిన్న దీక్షకు దిగిన ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ను.. పోలీసులు అరెస్టు చేసి.. బలవంతంగా నిమ్స్కు తరలించారు. వైద్యం తీసుకునేందుకు నిరాకరించిన ఆయన.. నిరశన కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఇవాళ ప్రగతి భవన్ ముట్టడికి కమలనాథులు కదలనున్నారు. మే 2న తెలంగాణ బంద్కు లక్ష్మణ్ పిలుపిచ్చారు. ఇంటర్ ఫలితాల్లో గందరగోళంపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించి.. భవిష్యత్లో రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అటు ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్టూడెంట్ యూనియన్ల నిరసనలు కొనసాగుతున్నాయి. అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి