త్వరలో చిరు మరో సినిమా షురూ..కొరటాల తో జోడి
- April 30, 2019తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 చిత్రంతో పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం ఘన విజయం సాధించిన తర్వాత ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా నరసింహారెడ్డి'చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ నేపథ్యంలో చిరంజీవి తదుపరి చిత్రంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.
చిరంజీవి తన తదుపరి చిత్రం కొరటాల శివతో వున్న సంగతి తెలిసిందే. 'సైరా' షూటింగ్ త్వరలో పూర్తి చేసుకొని పెద్ద గ్యాప్ లేకుండా రెగ్యులర్ కొత్త చిత్రం షూటింగును మొదలుపెడతారని అంటున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసిన కొరటాల ఈ చిత్రం ఆగస్టులో మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది.
ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారట. ఇక హీరోయిన్లుగా తమన్నా, శ్రుతిహాసన్ పేర్లు వినిపిస్తున్నాయిగానీ, ఇంకా క్లారిటీ రాలేదు. ఈ చిత్రంలో సునీల్, అనసూయ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారనే టాక్ మాత్రం వినిపిస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ