దుబాయ్‌ క్రీక్‌లో మునిగిపోయిన ఇండియన్‌

- May 02, 2019 , by Maagulf
దుబాయ్‌ క్రీక్‌లో మునిగిపోయిన ఇండియన్‌

దుబాయ్‌:కేరళకు చెందిన సహద్‌ అబ్దుల్‌ సలామ్‌, తన స్నేహితులు ఇద్దరితో కలిసి జుడాఫ్‌ డిస్ట్రిక్ట్‌లో చేపలు పడుతుండగా, దుబాయ్‌ క్రీక్‌లోకి పడిపోయినట్లు అథారిటీస్‌ వెల్లడించాయి. ఈ ఘటన గురించిన సమాచారం అందుకోగానే, పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి టీమ్‌ అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తూ అబ్దుల్‌ సలామ్‌ మృతదేహాన్ని మాత్రమే వెలికి తీయగలిగారు కోస్ట్‌ గార్డ్‌ డైవర్స్‌. మృతదేహాన్ని జనరల్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫోరెన్సిక్‌ మెడిసిన్‌కి తరలించినట్లు దుబాయ్‌ పోలీస్‌ వెల్లడించారు. సలామ్‌కి ఓ భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు. కేరళలోని కొల్లామ్‌కి చెందినవారు సలామ్‌. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com