డబ్బింగ్ పనుల్లో 'సాహో'
- May 04, 2019
బాహుబలి అభిమానుల ఎదురుచూపులకి తెరపడబోతుంది. సాహో సినిమా శరవేగంగా రిలీజ్ కి రెడీ అవుతోంది. బాహుబలి ఈసారి బాంబులతో యుద్ధం చేయబోతున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా 200 కోట్లకిపైగా బడ్జెట్ తో తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో. ఈ మూవీ షూటింగ్ చివరిదశకి చేరుకుంది. శుక్రవారంతో సాహో షూటింగ్ ఒక్క పాట మినహా మొత్తం కంప్లీట్ అయ్యింది. ఈ రోజు (మే 4, 2019) నుంచి డబ్బింగ్ కార్యక్రమాలు మొదలవ్వనున్నాయి. ఆగష్టు 15న సాహో ఆడియన్స్ ముందుకి రానుంది.
సాహో ఇలా కంప్లీట్ అయ్యిందో లేదో ప్రభాస్ వెంటనే రాధాకృష్ణ సినిమాకి షిఫ్ట్ అయ్యేందుకు ప్లాన్ వేసుకున్నాడు. సాహో డబ్బింగ్ పూర్తిగాకానే మే పదిన యూరప్ ఫ్లైట్ ఎక్కేందుకు రెడీ అవుతున్నాడు. రాధాకృష్ణ డైరెక్షన్ లో ప్రభాస్, పూజా హెగ్డె జంటగా రానున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా షూటింగ్ యూరప్ లో జరగనుంది.
తాజా వార్తలు
- నగరవాసులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- భారత్ టెక్స్–2026లో ఆంధ్రప్రదేశ్కు రూ.4,100 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- బహ్రెయిన్, కువైట్, జోర్డాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 18 గంటల సమయం
- రెస్టారెంట్ పై పరువునష్టం కలిగించే వీడియో..
- బహ్రెయిన్ పై ఇరాన్ వైమానిక దాడులు విఫలం.. క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేసిన రక్షణ దళాలు
- ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం..
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!







