డబ్బింగ్ పనుల్లో 'సాహో'
- May 04, 2019బాహుబలి అభిమానుల ఎదురుచూపులకి తెరపడబోతుంది. సాహో సినిమా శరవేగంగా రిలీజ్ కి రెడీ అవుతోంది. బాహుబలి ఈసారి బాంబులతో యుద్ధం చేయబోతున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా 200 కోట్లకిపైగా బడ్జెట్ తో తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో. ఈ మూవీ షూటింగ్ చివరిదశకి చేరుకుంది. శుక్రవారంతో సాహో షూటింగ్ ఒక్క పాట మినహా మొత్తం కంప్లీట్ అయ్యింది. ఈ రోజు (మే 4, 2019) నుంచి డబ్బింగ్ కార్యక్రమాలు మొదలవ్వనున్నాయి. ఆగష్టు 15న సాహో ఆడియన్స్ ముందుకి రానుంది.
సాహో ఇలా కంప్లీట్ అయ్యిందో లేదో ప్రభాస్ వెంటనే రాధాకృష్ణ సినిమాకి షిఫ్ట్ అయ్యేందుకు ప్లాన్ వేసుకున్నాడు. సాహో డబ్బింగ్ పూర్తిగాకానే మే పదిన యూరప్ ఫ్లైట్ ఎక్కేందుకు రెడీ అవుతున్నాడు. రాధాకృష్ణ డైరెక్షన్ లో ప్రభాస్, పూజా హెగ్డె జంటగా రానున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా షూటింగ్ యూరప్ లో జరగనుంది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..