వాట్సాప్ స్కామ్: 50,000 దిర్హామ్లు నష్టపోయిన మహిళ
- May 09, 2019
ఆసియాకి చెందిన ఓ వ్యక్తి, ఓ మహిళ నుంచి 50,000 దిర్హామ్లు దోచుకున్న కారణంగా విచారణ ఎదుర్కొంటున్నాడు. వాట్సాప్ స్కామ్ ద్వారా ఈ దోపిడీ జరిగినట్లు పోలీస్ ప్రాసిక్యూషన్ రికార్డ్స్ వెల్లడిస్తున్నాయి. 200,000 దిర్హామ్ల విలువైన క్యాష్ ప్రైజులు గెల్చుకునే అవకాశమంటూ వాట్సాప్ ద్వారా ఫేక్ మెసేజ్ని నిందితుడు పంపగా, అది చూసి నిజమనుకుని బాధితురాలు ఒకరు అతన్ని సంప్రదించారు. అయితే, నిందితురాలి బ్యాంక్ డిటెయిల్స్ సేకరించి, అందులోంచి 50,000 దిర్హామ్లను తన ఖాతాలోకి మళ్ళించుకున్నాడు నిందితుడు. జరిగిన మోసం తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో తదుపరి విచారణను మే 14వ తేదీకి వాయిదా వేశారు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









