వాట్సాప్‌ స్కామ్‌: 50,000 దిర్హామ్‌లు నష్టపోయిన మహిళ

- May 09, 2019 , by Maagulf
వాట్సాప్‌ స్కామ్‌: 50,000 దిర్హామ్‌లు నష్టపోయిన మహిళ

ఆసియాకి చెందిన ఓ వ్యక్తి, ఓ మహిళ నుంచి 50,000 దిర్హామ్‌లు దోచుకున్న కారణంగా విచారణ ఎదుర్కొంటున్నాడు. వాట్సాప్‌ స్కామ్‌ ద్వారా ఈ దోపిడీ జరిగినట్లు పోలీస్‌ ప్రాసిక్యూషన్‌ రికార్డ్స్‌ వెల్లడిస్తున్నాయి. 200,000 దిర్హామ్‌ల విలువైన క్యాష్‌ ప్రైజులు గెల్చుకునే అవకాశమంటూ వాట్సాప్‌ ద్వారా ఫేక్‌ మెసేజ్‌ని నిందితుడు పంపగా, అది చూసి నిజమనుకుని బాధితురాలు ఒకరు అతన్ని సంప్రదించారు. అయితే, నిందితురాలి బ్యాంక్‌ డిటెయిల్స్‌ సేకరించి, అందులోంచి 50,000 దిర్హామ్‌లను తన ఖాతాలోకి మళ్ళించుకున్నాడు నిందితుడు. జరిగిన మోసం తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో తదుపరి విచారణను మే 14వ తేదీకి వాయిదా వేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com