మద్యం మత్తులో సోదరిపై కాల్పులు జరిపిన కువైటీ
- May 11, 2019కువైట్: కువైటీ వ్యక్తి ఒకరు మద్యం మత్తులో తన సోదరిపైనే కాల్పులు జరిపిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి చెందిన ఆపరేషన్ రూమ్కి ఈ సమాచారం అందింది. సమాచారం అందుకోగానే, సంఘటనా స్థలానికి పారామెడిక్స్, సెక్యూరిటీ సిబ్బంది చేరుకున్నారు. ఆ సమయంలో సంఘటనా స్థలంలో కలష్నికోవ్ గన్తో నిందితుడు కన్పించాడు. తన సోదరితో జరిగిన గొడవ కారణంగా తాను ఆమెపై దాడి చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతోంది. ఆ పరిస్థితి నిలకడగా వుందని వైద్యులు వెల్లడించారు. నిందితుడి సోదరుల్ని ఈ కేసులో సాక్షులుగా పరిగణిస్తున్నారు అధికారులు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్