ఈ నెల 17న ముసుగులు తీస్తాను--సునీల్ కుమార్ రెడ్డి
- May 13, 2019
హైదరాబాద్:కంటెంట్వుంటే బడ్జెట్తో పనిలేదని టాలీవుడ్లో ట్రెండ్ సృష్టించిన పి సునీల్కుమార్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం -రొమాంటిక్ క్రిమినల్స్. ఒక రొమాంటిక్ క్రైమ్కథ, ఒక క్రిమినల్ ప్రేమకథ చిత్రాలకి సీక్వెల్గా వస్తోన్న చిత్రాన్ని ఎక్కలి రవీందర్బాబు, బి బాపిరాజు నిర్మించారు. యువతరాన్ని మత్తువైపు మళ్లిస్తున్న పరిస్థితులు, ఇంటర్నెట్ అశ్లీలతను కంటెంట్ చేసుకుని ఎంటర్టైనింగ్గా చిత్రాన్ని తెరకెక్కించారు. మనోజ్ నందం ఇంజినీరింగ్ స్టూడెంట్గా, సీనియర్ స్టూడెంట్గా అవంతిక, డ్రగ్ సెల్లర్గా వినయ్, నైన్త్ స్టూడెంట్గా వౌనిక, కొత్తగా పెళ్లైన గృహిణిగా దివ్య నటించిన చిత్రం 17న ప్రేక్షకులముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సునీల్కుమార్రెడ్డి మాట్లాడుతూ 'గతంలో వచ్చిన చిత్రాలకంటే దీని కంటెంట్ కోసం ఎక్కువ రీసెర్చ్ చేశానన్నారు. సమాజంలో ముసుగుచాటున చాలా జరుగుతున్నాయని, వాటిని యూత్కి కనెక్టయ్యేలా సినిమా డిజైన్ చేశామన్నారు. మనోజ్ నందం మాట్లాడుతూ సినిమా విడుదల వరకూ ముసుగులు కొనసాగిస్తామని, భిన్నమైన కథని విభిన్నంగా చెబుతున్నామన్నారు. బర్నింగ్ ఇష్యూస్ని యూత్కి అర్థమయ్యే కోణంలో చూపించామన్నారు. హీరోయిన్ అవంతిక మాట్లాడుతూ ముసుగు వెనక దాగివున్న రహస్యాలను అవగాహనాత్మకంగా దర్శకుడు చూపించారన్నారు. నిర్మాత రవీంద్రబాబు, బాపిరాజులు మాట్లాడుతూ రొమాంటిక్ క్రిమినల్ చిత్రం తప్పకుండా అందరినీ మెప్పిస్తుందన్న నమ్మకం ఉందన్నారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







