హీరా గోల్డ్ సీఈఓ నౌహీరా షేక్ను కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు
- May 14, 2019
హైదరాబాద్: హీరాగోల్డ్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. హీరా గోల్డ్ సీఈఓ నౌహీరా షేక్ను కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు స్పందించిన కోర్టు 7రోజులు పాటు కస్టడీకి అనుమతించింది. నౌహీరాతో పాటు బిజూ థామస్, మౌళి థామస్ను కూడా ఈడీ కస్టడీకి తీసుకోనుంది. 50 వేల కోట్ల రూపాయలు మనీలాండిరింగ్ పాల్పడినట్లు ఈడీ అనుమానిస్తోంది. కాగా ఈ ముగ్గుర్నీ మరి కాసేపట్లో చంచల్ గూడ జైల్ నుంచి ఈడీ అధికారులు కస్టడీకి తీసుకొని విచారించునున్నారు.
ఇదిలా ఉంటే.. తిరుపతికి చెందిన హీరా గోల్డ్ గ్రూపు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రజల నుంచి పెద్ద మొత్తంలో గోల్డ్ డిపాజిట్లు చేయించుకుని తిరిగి ఇవ్వలేదు. దీంతో బాధితులు ఫిర్యాదు చేయడంతో హీరా గోల్డ్ గ్రూపు మోసాలు ఒక్కొక్కటిగా వెలుగుచూశాయి. ఇప్పటికే హీరా గోల్డ్లో మనీ లాండరింగ్ జరిగిందని సీసీఎస్ పోలీసులు గుర్తించిన విషయం విదితమే.
తాజా వార్తలు
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మహిళా కమిషన్ విచారణలో శివాజీ క్షమాపణలు
- బ్యాంక్ సెలవుల జాబితా విడుదల
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!







