హీరా గోల్డ్ సీఈఓ నౌహీరా షేక్‌ను కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు

- May 14, 2019 , by Maagulf
హీరా గోల్డ్ సీఈఓ నౌహీరా షేక్‌ను కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు

హైదరాబాద్: హీరాగోల్డ్‌ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. హీరా గోల్డ్ సీఈఓ నౌహీరా షేక్‌ను కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు స్పందించిన కోర్టు 7రోజులు పాటు కస్టడీకి అనుమతించింది. నౌహీరాతో పాటు బిజూ థామస్, మౌళి థామస్‌ను కూడా ఈడీ కస్టడీకి తీసుకోనుంది. 50 వేల కోట్ల రూపాయలు మనీలాండిరింగ్ పాల్పడినట్లు ఈడీ అనుమానిస్తోంది. కాగా ఈ ముగ్గుర్నీ మరి కాసేపట్లో చంచల్ గూడ జైల్ నుంచి ఈడీ అధికారులు కస్టడీకి తీసుకొని విచారించునున్నారు.

ఇదిలా ఉంటే.. తిరుపతికి చెందిన హీరా గోల్డ్ గ్రూపు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రజల నుంచి పెద్ద మొత్తంలో గోల్డ్ డిపాజిట్లు చేయించుకుని తిరిగి ఇవ్వలేదు. దీంతో బాధితులు ఫిర్యాదు చేయడంతో హీరా గోల్డ్ గ్రూపు మోసాలు ఒక్కొక్కటిగా వెలుగుచూశాయి. ఇప్పటికే హీరా గోల్డ్‌లో మనీ లాండరింగ్ జరిగిందని సీసీఎస్ పోలీసులు గుర్తించిన విషయం విదితమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com