కమల్ హాసన్పై కేసు నమోదు
- May 15, 2019
స్వతంత్ర భారతంలో తొలి ఉగ్రవాది గాడ్సే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీనటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్పై కేసు నమోదైంది. హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కమల్పై అరవక్కురిచ్చి పోలీస్ స్టేషన్లో కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో కమల్ హాసన్పై 153-ఏ, 295-ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
అరువక్కురిచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కమల్…స్వతంత్ర భారతంలో తొలి ఉగ్రవాది హిందూ వ్యక్తి నాథూరామ్ గాడ్సే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాత్మగాంధీని హత్యచేసిన గాడ్సేతోనే దేశంలో ఉగ్రవాదం ఆరంభమైందని వివాదాస్పద కామెంట్స్ చేశారు కమల్. ఇక్కడ ముస్లీం ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారని తాను చెప్పడం లేదని..ఎక్కడైనా ఇదే మాట చెబుతానని అన్నారు. కమల్ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హిందువుల మనోభావాలు దెబ్బతిసిన కమల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- యువతికి పునర్జన్మ ప్రసాదించిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు!
- ప్రముఖ నిర్మాత RB చౌదరి కన్నుమూత
- యూఏఈ పై మళ్లీ ఇరాన్ క్షిపణి దాడుల ముప్పు.. గగనతల రక్షణ వ్యవస్థలు అప్రమత్తం
- ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్
- రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ సమీపంలో అమెరికా సైనిక విమానం అదృశ్యం..
- ఎతిహాద్ రైల్.. అబుదాబి, దుబాయ్, ఫుజైరా కనెక్ట్..ఫుల్ డిటైల్స్..!!
- బుఖా ఘటనలో ఇద్దరు విదేశీయులకు గాయాలు, వాహనాలకు నష్టం..!!
- హోర్ముజ్ జలసంధిని "బేరసారాల సాధనంగా" చేయొద్దు: ఖతార్









