కమల్ హాసన్పై కేసు నమోదు
- May 15, 2019
స్వతంత్ర భారతంలో తొలి ఉగ్రవాది గాడ్సే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీనటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్పై కేసు నమోదైంది. హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కమల్పై అరవక్కురిచ్చి పోలీస్ స్టేషన్లో కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో కమల్ హాసన్పై 153-ఏ, 295-ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
అరువక్కురిచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కమల్…స్వతంత్ర భారతంలో తొలి ఉగ్రవాది హిందూ వ్యక్తి నాథూరామ్ గాడ్సే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాత్మగాంధీని హత్యచేసిన గాడ్సేతోనే దేశంలో ఉగ్రవాదం ఆరంభమైందని వివాదాస్పద కామెంట్స్ చేశారు కమల్. ఇక్కడ ముస్లీం ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారని తాను చెప్పడం లేదని..ఎక్కడైనా ఇదే మాట చెబుతానని అన్నారు. కమల్ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హిందువుల మనోభావాలు దెబ్బతిసిన కమల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







