పోర్చుగీస్ టీమ్ తో మన్మధుడు
- May 15, 2019
మన్మధుడు సీక్వెల్ గా వస్తున్న సినిమా మన్మధుడు 2. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పోర్చుగల్ లోని అందమైన లొకేషన్స్ లో జరుగుతున్నది. నాగార్జున హీరోగా చేస్తున్న ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మన్మధుడు సినిమా క్లాసికల్ హిట్ అయ్యింది. ఆ క్లాసిక్ కు సీక్వెల్ గా మన్మధుడు 2 సినిమా తెరకెక్కుతోంది.
రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో సమంత క్యామియో రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటె, పోర్చుగల్ లో అక్కడి టిమ్ తో కలిసి మన్మధుడు నాగార్జున ఫోటో దిగి ఆ ఫోటోను సోషల్ మీడియాలో మన్మధుడు డైరీస్ పేరుతో పోస్ట్ చేశారు. పోర్చుగీస్ లో షూటింగ్ చేయడం చాలా ఆనందంగా ఉందని, మన్మధుడు 2 కు పనిచేసిన పోర్చుగీస్ యూనిట్ కు నాగార్జున థాంక్స్ చెప్తూ ట్విట్టర్ లో ఫోటో షేర్ చేశాడు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.
తాజా వార్తలు
- రక్షణ సహకారంపై కువైట్, ఫ్రాన్స్ చర్చలు..!!
- రియాద్లో చదరపు మీటరుకు SR1,500..ఆన్ లైన్ వేదిక ప్రారంభం..!!
- బహ్రెయిన్-యుఎస్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం..!!
- ఒమన్ లో 15 కిలోల బంగారు కడ్డీలు సీజ్..!!
- ఇజ్రాయెల్ డిప్యూటీ రాయబారికి సమన్లు జారీ చేసిన యూఏఈ..!!
- ఖతార్ లో రెండు రోజుల పాటు సముద్ర నావిగేషన్ సస్పెండ్..!!
- గోల్డ్ రూల్స్..క్లారిటీ కోరిన యూఏఈలోని ఇండియన్ కమ్యూనిటీ..!!
- ఖతార్ పై ఇజ్రాయెల్ దాడిని తప్పుబట్టిన UNSC..!!
- ముబారకియా మార్కెట్లో 20 దుకాణాలు మూసివేత..!!
- ఇన్సూరెన్స్ కంపెనీకి షాకిచ్చిన అప్పీల్ కోర్టు..!!