పోర్చుగీస్ టీమ్ తో మన్మధుడు
- May 15, 2019
మన్మధుడు సీక్వెల్ గా వస్తున్న సినిమా మన్మధుడు 2. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పోర్చుగల్ లోని అందమైన లొకేషన్స్ లో జరుగుతున్నది. నాగార్జున హీరోగా చేస్తున్న ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మన్మధుడు సినిమా క్లాసికల్ హిట్ అయ్యింది. ఆ క్లాసిక్ కు సీక్వెల్ గా మన్మధుడు 2 సినిమా తెరకెక్కుతోంది.
రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో సమంత క్యామియో రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటె, పోర్చుగల్ లో అక్కడి టిమ్ తో కలిసి మన్మధుడు నాగార్జున ఫోటో దిగి ఆ ఫోటోను సోషల్ మీడియాలో మన్మధుడు డైరీస్ పేరుతో పోస్ట్ చేశారు. పోర్చుగీస్ లో షూటింగ్ చేయడం చాలా ఆనందంగా ఉందని, మన్మధుడు 2 కు పనిచేసిన పోర్చుగీస్ యూనిట్ కు నాగార్జున థాంక్స్ చెప్తూ ట్విట్టర్ లో ఫోటో షేర్ చేశాడు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







