ఆకస్మిక వరదల్లో ఓ కుటుంబం గల్లంతు
- May 20, 2019ఒమన్లో భారీ వర్షాల కారణంగా చోటు చేసుకున్న ఆకస్మిక వరదల్లో ఓ కుటుంబం గల్లంతయ్యింది. వారు ప్రయాణిస్తున్న కారు వరదలో కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. వారంతా భారతదేశానికి చెందినవారని అధికారులు అంటున్నారు. వాడి బని ఖాలిద్ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 28 రోజుల పసికందు కూడా గల్లంతవడం గమనార్హం. రెస్క్యూ టీమ్స్, వారు ప్రయాణిస్తున్న వాహనానికి సంబంధించిన శకలాల్ని కనుగొన్నప్పటికీ, బాధిత కుటుంబం ఆచూకీ మాత్రం తెలుసుకోలేకపోయారు. సర్దార్ ఫజల్ అహ్మద్ అనే వ్యక్తికి చెందిన కుటుంబం ఈ వరదల్లో గల్లంతయ్యింది. వరదల సమయంలో తాను ఎలాగో ఓ చెట్టుని పట్టుకుని ప్రాణాలు నిలుపుకున్నట్లు తెలిపారాయన.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!