కార్మికులు పనిచేసే చోట్ల 'స్మార్ట్ కార్లు'
- January 02, 2016
యూఏఈలో ప్రయోగాత్మకంగా స్మార్ట్ కార్ని ప్రవేశపెట్టారు. నవంబర్లోనే ఈ కారు ప్రారంభమైనా, కొన్ని కారణాలతో ఈ కారుని వాడుకలోకి తీసుకురాలేదు. ఈ కారుని అతి త్వరలో వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించారు. కార్మికులు ఎక్కువగా పనిచేసే ప్రాంతాల్లో స్మార్ట్ కార్ని వినియోగించాలని, ఇన్స్పెక్షన్ కోసమే ఈ కారుని ఉపయోగించాలని అధికారులు భావిస్తున్నారు. ఇన్నోవేషన్ ఇయర్ 2015లో భాగంగా స్మార్ట్ కార్ని తీసుకొచ్చారు. ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ , వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్, మరియు దుబాయ్ రూలర్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ దేశాన్ని టెక్నాలజీ పరంగా ముందుకు తీసుకెళ్ళాలనే మిషన్తో అన్ని రంగాల్లో స్మార్ట్ టెక్నాలజీని తీసుకొస్తున్నారు. స్మార్ట్ కార్లో స్మార్ట్ ఇన్స్పెక్టర్, స్మార్ట్ ఇన్స్పెక్షన్ మరియు సెంట్రల్ కంట్రోల్ రూమ్ వంటి ముఖ్యమైన విభాగాలతో పనిచేస్తుందని అల్ సయీది చెప్పారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







