ఇంగ్లండ్ బయలుదేరిన కోహ్లిసేన
- May 22, 2019
ముంబై: ప్రపంచకప్ కోసం టీమిండియా జట్టు లండన్కు పయనమైంది. బుధవారం తెల్లవారుఝామున ముంబై ఎయిర్పోర్ట్ నుంచి కోహ్లిసేన ఇంగ్లాండ్కు పయనమైంది. కోహ్లి, ధోని సహా ఇతర ఆటగాళ్లు అధికార దుస్తుల్లో విమానాశ్రయంలో ఉన్న ఫోటోలను బిసిసిఐ ట్విట్టర్ ద్వారా పంచుకుంది. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, బౌలర్లు బుమ్రా, చాహల్, హార్థిక్ పాండ్యా కూడా ఫోటోలు ట్వీట్ చేశారు.
మొదటగా జూన్5న దక్షిణాఫ్రికాతో మ్యాచ్తో భారత్ తన ప్రయాణం మొదటుపెట్టనుంది. అంతకంటే ముందు న్యూజిలాండ్, బంగ్లాదేశ్లో కోహ్లిసేన రెండు వార్మప్ మ్యాచ్లు ఆడనుంది. ఇంగ్లాండ్ బయలుదేరే ముందు కోహ్లి, రవిశాస్త్రి మంగళవారం మీడియాతో మాట్లాడారు. వ్యక్తిగతంగా ఇది తనకు అత్యంత సవాలుతో కూడుకున్న ప్రపంచకప్ అనిపిస్తుంది.
ఏ జట్టు ఏ జట్టుకైనా షాకివ్వచ్చు, ఫార్మాట్ ఇంతకుముందులా లేదు కాబట్టి ప్రతి మ్యాచ్లో ఉత్తమ ప్రదర్శన చేయాల్సిందే. ఇదో భిన్నమైన సవాల్, దీనికి ఎంత వేగంగా అలవాటు పడతామన్నది కీలకం అని కోహ్లి అన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









