ఇందిరాగాంధీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు
- May 25, 2019ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్..ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి పెట్టాడు. ఈనెల 30న ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ను ఆహ్వానించనున్నారు జగన్. అందుకు ఇవాళ సాయంత్రం ప్రగతి భవన్ కు వెళ్లి కేసీఆర్తో మర్యాదపూర్వంగా భేటీ కానున్నారు. ఈనెల 30న విజయవాడలో జరిగే ప్రమాణ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందించనున్నారు. అనంతరం కేటీఆర్తో కూడా జగన్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.
కేసీఆర్ భేటీ కంటే ముందే రాజ్భవన్లో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్ను కలవనున్నారు జగన్. ఎన్నికల్లో మెజారిటీ సాధించిన వైసీపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. శాసన సభా పక్షనేతగా ఎన్నుకున్నట్టు వైసీపీ ఎల్పీ ఆమోదించిన తీర్మాణాన్ని గవర్నర్కు అందించనున్నారు జగన్.
కాసేపట్లో తాడేపల్లిలో జగన్ క్యాంప్ ఆఫీస్లో వైసీపీఎల్పీ భేటీ కానుంది. శాసనసభా పక్ష నేతగా వైఎస్ జగన్ను లాంఛనంగా ఎన్నుకోనున్నారు ఎమ్మెల్యేలు. అనంతరం ఎమ్మెల్యేలు ఆమోదించిన తీర్మాణాన్ని గవర్నర్కు అందజేయనున్నారు. సాయంత్రం 4గంటలకు గవర్నర్తో జగన్ భేటీ అవుతారు.
తాజా వార్తలు
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం