ఇందిరాగాంధీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు
- May 25, 2019
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్..ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి పెట్టాడు. ఈనెల 30న ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ను ఆహ్వానించనున్నారు జగన్. అందుకు ఇవాళ సాయంత్రం ప్రగతి భవన్ కు వెళ్లి కేసీఆర్తో మర్యాదపూర్వంగా భేటీ కానున్నారు. ఈనెల 30న విజయవాడలో జరిగే ప్రమాణ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందించనున్నారు. అనంతరం కేటీఆర్తో కూడా జగన్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.
కేసీఆర్ భేటీ కంటే ముందే రాజ్భవన్లో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్ను కలవనున్నారు జగన్. ఎన్నికల్లో మెజారిటీ సాధించిన వైసీపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. శాసన సభా పక్షనేతగా ఎన్నుకున్నట్టు వైసీపీ ఎల్పీ ఆమోదించిన తీర్మాణాన్ని గవర్నర్కు అందించనున్నారు జగన్.
కాసేపట్లో తాడేపల్లిలో జగన్ క్యాంప్ ఆఫీస్లో వైసీపీఎల్పీ భేటీ కానుంది. శాసనసభా పక్ష నేతగా వైఎస్ జగన్ను లాంఛనంగా ఎన్నుకోనున్నారు ఎమ్మెల్యేలు. అనంతరం ఎమ్మెల్యేలు ఆమోదించిన తీర్మాణాన్ని గవర్నర్కు అందజేయనున్నారు. సాయంత్రం 4గంటలకు గవర్నర్తో జగన్ భేటీ అవుతారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







