మోడీని కలిసిన జగన్
- May 26, 2019
దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీతో వైకాపా శాసనసభాపక్ష నేత జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. ఆదివారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ చేరుకున్న జగన్.. నేరుగా లోక్కల్యాణ్మార్గ్లోని ప్రధాని నివాసానికి వెళ్లారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన మోదీకి జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా ప్రధానిని జగన్ ఆహ్వానించారు. ఈ భేటీలో రాష్ట్రంలోని పరిస్థితులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సాయంవంటి అంశాల్ని జగన్ ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
మోదీని కలిసిన జగన్ బృందంలో లోక్సభకు తొలిసారి ఎన్నికైన ఇద్దరు ఎంపీలు ఉన్నారు. రాజమహేంద్రవరం, బాపట్ల ఎంపీలు మార్గాని భరత్, నందిగం సురేశ్తోపాటు ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, అవినాశ్రెడ్డి, మిథున్రెడ్డి, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఉన్నారు.
మోదీతో భేటీ అనంతరం జగన్ ప్రధాని నివాసం నుంచి ఏపీ భవన్కు చేరుకుంటారు. అనంతరం ఏపీ భవన్ సిబ్బందితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. స్థానికంగా తనను కలవడానికి వచ్చేవారితోనూ జగన్ మాట్లాడనున్నారు. దిల్లీలోని ఏపీ క్యాడర్ అధికారులు ఆయన్ని కలవనున్నారు. మధ్యాహ్న భోజనం ఏపీ భవన్లోనే చేసి సాయంత్రం తిరుగు ప్రయాణమవుతారని ఏపీ భవన్ వర్గాలు వెల్లడించాయి. దిల్లీ నుంచి ఆయన తిరుపతికి వెళ్లి అక్కడే బస చేయనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







