ఇండోనేసియా: సెగలు కక్కుతున్న అగ్ని పర్వతం
- May 26, 2019జకార్తా : ఇండోనేసియాలోని ఆగంగ్ అగ్ని పర్వతం సెగలు కక్కుతూ భారీయెత్తున బూడిదను వెలువరిస్తున్న నేపథ్యంలో బాలి, ఆస్ట్రేలియా మధ్య అనేక విమాన సర్వీసులను రద్దుచేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ అగ్ని పర్వతం వెలువరిస్తున్న బూడిద 4,600 మీటర్ల ఎత్తున పేరుకుపోవటంతోపాటు, దీని నుండి వెలువడుతున్న లావా కొన్ని కిలోమీటర్ల మేర విస్తరించిందని అధికారులు చెప్పారు. పర్వత శిఖరం నుండి రాళ్లు, కొండ చరియలు కొన్ని కి.మీదూరం మేర ఎగిరిపడుతున్నాయన్నారు. తూర్పు బాలిలో వున్న ఆగంగ్ అగ్ని పర్వతం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 7.22 గంటల నుండి విస్ఫోటనం చెందిందని, ఈ విస్ఫోటనాలు దాదాపు 4 నిముషాలు కొనసాగాయని అధికారులు చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రజలకు 50 వేలకుపైగా మాస్క్లను అందుబాటులో వుంచామని అధికారులు వివరించారు.అగ్నిపర్వతం రగులుతున్నప్పటికీ ఇప్పటి వరకూ ఎటువంటి ప్రాణనష్టం, లేదా ప్రజల తరలింపు వంటివి లేవని తెలుస్తోంది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..