రాష్ట్రపతి భవన్ చరిత్రలోనే అతిపెద్ద వేడుకగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం
- May 30, 2019
న్యూఢిల్లీ: నేడు ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేనిరీతిలో అతిపెద్ద వేడుకగా ప్రధాని ప్రమాణస్వీకారం కార్యక్రమం జరగనుంది. వివిధ దేశాధినేతలు, గత కేబినెట్ లోని మంత్రులు, దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు అందరూ కలుపుకుని దాదాపు 8 వేల మంది ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. దీంతో ఢిల్లీ మొత్తం దాదాపు 10,000 పైగా మందితో భద్రతా బలగాలను మొహరించి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రాత్రి 7 గంటలకు ప్రమాణస్వీకారం కార్యక్రమం జరగనుండగా ఈ వేడుకకు హాజరయ్యే ప్రముఖులకు భద్రత కల్పిస్తూ ఇప్పటికే ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ బలగాలు బందోబస్తులో పాల్గొని ఢిల్లీని అనుక్షణం పహారా కాస్తున్నాయి.
ప్రమాణస్వీకారం నేపథ్యంలో నరేంద్ర మోదీ నేడు రాజ్ ఘాట్, సదైవ్ అటల్ సమాధి, నేషనల్ వార్ మెమొరియల్ వంటి పవిత్ర స్థలాలకు వెళ్లి నివాళులు అర్పించనున్నారు. ఈ నేపథ్యంలో కాబోయే ప్రధానికి భారీ భద్రత కల్పిస్తూ ఎత్తైన భవనాలపై నుంచి స్పైపర్స్, షార్ప్ షూటర్స్ సైతం బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







