5జి నెట్వర్క్: ఎటిసలాట్ తొలి మెనా నెట్వర్క్
- May 30, 2019యూ.ఏ.ఈ:ఎట్టకేలకు యూఏఈలో 5జి సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. టెలికామ్ ఆపరేటర్ ఎటిసలాట్, ఇకపై యూఏఈలో వినియోగదారులు 5జి నెట్వర్క్ని పొందవచ్చునని ప్రకటించింది. ఎలాంటి అదనపు ఛార్జీలూ లేకుండా 5జి రెడీ జెడ్టిఇ యాక్సన్ 10 ప్రో ద్వారా ఈ కొత్త అనుభూతిని పొందడానికి వీలుంది. 4జితో పోల్చితే 20 రెట్లు వేగంతో 5జి సేవలు వినియోగదారులకు గొప్ప అనుభూతినివ్వనున్నాయి. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా అత్యంత వేగంతో కూడిన నెట్వర్క్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఎటిసలాట్ పేర్కొంది. యాక్సాన్ 10 ప్రో కొనుగోలు కోసం మూడు ఆప్షన్స్ని ఎటిసలాట్ వినియోగదారుల ముందుంచింది. వీటిల్లో స్ట్రెయిట్ పేమెంట్ కింద 5,555 దిర్హామ్లు చెల్లించవచ్చు. అలాగే, 12, 18, 24 నెలల ఇన్స్టాల్మెంట్స్ ప్రాతిపదికన 473, 318, 241 దిర్హామ్లు చెల్లించడానికీ అవకాశం కల్పిస్తున్నారు. పోస్ట్పెయిడ్, ప్రీపెయిడ్ వినియోగదారులకు ఈ సేవలు అందుబాటులో వుంటాయి.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్