వినియోగదారుల హక్కుల పరిరక్షణలో ఎం.ఇ.సి.
- January 02, 2016
ఖతర్ లో 2015 ఏడాది లో ఆర్ధిక మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ వినియోగదారుల పరిరక్షణ శాఖ ( ఎం.ఇ.సి.) మధ్య బలమైన సంబంధాలు కొనసాగుతున్నట్లు సంబంధిత శాఖ పేర్కొంది. స్థానిక అరబిక్ దినపత్రిక ఆర్రయహ్ తెలిపిన వివరాల ప్రకారం , గత ఏడాది 537 వినియోగదారుల ఉల్లంఘనలు జరగ్గా, అందులో 48 వాణిజ్య సముదాయాలను వివిధ కాలాల్లో మూసివేయడం జరిగింది. మూసివేయబడిన వాటిలో బాగా ప్రసిద్ధి పొందిన ముఖ్య కార్ల పంపిణీధారులు సైతం ఉండటం గమనార్హం.వినియోగదారుల పరిరక్షణ శాఖ నివేదిక మేరకు ఈ కార్ల పంపిణీదారులు పాత కార్ల విడి భాగాలను మరమ్మతులు చేసి , వాటికి రంగులు పులిమి కొత్త కార్లగా బ్రమింప చేసి అమ్మకాలను జరిపినట్లు పరిశీలనలో తేలింది. వీరు ఈ తరహ కార్ల అమ్మకాలలోని అసలు నిజం అటు ప్రభుత్వానికి గాని, ఇటు వినియోగదారునికి గాని తెలియచెప్పలేదు. వీరి వ్యాపారంలో ఒక మోసపూరితమైన విధానంను భీతి లేకుండా కొనసాగిస్తున్నట్లు వినియోగదారుల పరిరక్షణ శాఖ పరిగణించింది. వినియోగదారులకు నష్ట నివారణ చర్యలు చేపట్టమని తాము ఆయా కార్ల పంపిణీధారులను కోరగా, వీరిలో అత్యధికులు తాము ఇచ్చిన సూచనను మనస్పూర్తిగా అంగీకరించలేదన్నారు.ఆ విధంగా చేస్తే , తాము కార్ల వినియోగదారుల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోతామని చెప్పి వారు అందుకు అంగీకనించ లేదు. దీనితో ఖతర్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంతో కార్ల పంపిణీధారుల కపటం కట్టడి కాబడింది.
తాజా వార్తలు
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి







