కార్ల మార్కెట్ తరలింపు తో ఊపిరి పీల్చుకొన్న స్థానికులు
- January 03, 2016
అబూ షగర వాసులకు శుభవార్తతో కొత్త ఏడాది ప్రారంభమైంది. 2016 తొలిరోజునే ఉపయోగించబడని 370 కార్లను , ఆ ప్రాంతం నుంచి తరలించడంతో అబూ షగర ఇపుడు ఒక సుందరమైన నూతన శోభను సంతరించుకొంది. గత ఏడాది డిసెంబర్ 31 వ తెదే ఈ కార్ల తొలగింపునకు చివరి రోజుగా ప్రభుత్వం ప్రకటించిన విషయం స్థానికులకు విదితమే, గత 20 ఏళ్ళుగా అబూ షగర ప్రాంతవాసులకు ఈ గందరగోళ పార్కింగులు ఎంతో చికాకును కల్గిస్తుంది. ఇక్కడ నెలకొని ఉన్న అసౌకర్యాలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. " అమ్మకానికి కారు " అంటూ రాసి ఉన్న బోర్డులు పలు దుకాణాలు గజిబిజీగా ఉండేవి. అంతేకాకుండా, వివిధ కార్ల ఏజెంట్లు " కారు కొనండి...కారు కొనండి "
అని బిగ్గరగా కేకలు పెట్టేవారు. ప్రభుత్వం తీసుకొన్న ఒక మంచి నిర్ణయం కారణంగా, ప్రస్తుతం ఈ ప్రాంతం ఎంతో ప్రశాంతంగా , సుందరంగా రూపుదిద్దుకొంది. అబూ షగర నివాసితులు గతంలో తాము పడుతున్న ఇబ్బందుల గూర్చి షార్జా ప్రభుత్వానికి ఇచ్చిన పిర్యాఢులకు స్పందన రావడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







