ఇంట్లో అగ్ని ప్రమాదం: ముగ్గురి మృతి

- May 31, 2019 , by Maagulf
ఇంట్లో అగ్ని ప్రమాదం: ముగ్గురి మృతి

మస్కట్‌:ఒమనీ మహిళ, ఇద్దరు చిన్నారులు అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. తమ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో వీరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు పేర్కొన్నారు. విలాయత్‌ ఆఫ్‌ బహ్లాలోని జబ్రీన్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం గురించిన సమాచారం అందుకోగానే సంఘటనా స్థలానికి చేరుకున్న పిఎసిడిఎ సిబ్బంది, మంటల్ని అదుపు చేయడానికి ప్రయత్నించడం జరిగింది. అయితే అప్పటికే ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోందని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ అధికార ప్రతినిథి చెప్పారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com