షార్జాలో భవనం పైనుంచి పడి గాయపడ్డ వలస కార్మికుడు
- June 03, 2019షార్జా:30 ఏళ్ళ భారతీయ వలస కార్మికుడు ఓ భవనంపైనుంచి కింద పడటంతో తీవ్రగాయాలయ్యాయి. తలకు బలమైన గాయాలు కావడంతో ప్రస్తుతం అల్ కాసిమి హాస్పిటల్లోని ఐసీయూలో అతనికి వైద్య చికిత్స అందిస్తున్నారు. వలస కార్మికుడ్ని మహేంద్ర కుమార్గా గుర్తించారు. షార్జాలోని ఓ కాంట్రాక్టింగ్ కంపెనీ కోసం పనిచేస్తున్నాడు మహేంద్ర కుమార్. భవనం మెయిన్టెనెన్స్ వర్క్ చేస్తుండగా, ప్రమాదవశాత్తూ కింద పడిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఉదయం 9 గంటల సమయంలో సమాచారం తమకు అందిందనీ, వెంటనే సంఘటనా స్థలానికి వెళ్ళగా అక్కడ రక్తపు మడుగులో పడి వున్న కార్మికుడ్ని గుర్తించి, ప్రాథమిక చికిత్స అనంతరం హుటాహుటిన ఆసుపత్రికి తరలించామని పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం