రైళ్లలో మసాజ్.. తల, పాదాలకు మాత్రమే..
- June 09, 2019చరిత్రలోనే తొలిసారిగా ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వే కొత్త సేవకు సిద్ధమైంది. రైళ్లలో ఇకపై ప్రయాణికులకు మసాజ్ సర్వీసు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందోర్ నుంచి వెళ్లే 39 రైళ్లలో మసాజ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వెస్టన్ రైల్వే జోన్ పరిధిలోని రత్లం డివిజన్ నుంచి ఈ ప్రతిపాదన వచ్చినట్టు అధికారులు తెలిపారు. గోల్డ్, డైమండ్, ప్లాటినమ్ కేటగిరీల్లో వంద నుంచి 3 వందల రూపాయలుగా మసాజ్ చార్జీలు నిర్ణయించారు. 15 నుంచి 20 నిమిషాల పాటు మసాజ్ చేస్తారు.
ప్రస్తుతానికి తల, పాదాలకు మాత్రమే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య మసాజ్ చేస్తారు. ఎంపిక చేసిన రైళ్లలో గరిష్టంగా ఐదుగురు మసాజ్ చేసేవాళ్లను ఏర్పాటు చేస్తారు. వీళ్లకి రైల్వే శాఖ గుర్తింపుపత్రాలు జారీ చేస్తుంది. టిక్కెట్ రేట్లు పెంచకుండా రైల్వే ఆదాయం పెంచుకోవాలన్న లక్ష్యంలో భాగంగానే.. ఇలాంటి ప్రయోగాలు చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు. మరో 20 రోజుల్లో మసాజ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తానికి రైళ్లలోనూ మసాజ్ చేయించుకుంటూ ప్రయాణికులు ఎంజాయ్ చేయొచ్చు.
తాజా వార్తలు
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- 'డార్క్ స్కై పాలసీ' ప్రకటించిన అబుదాబి
- ఎజార్: రెంటర్స్ నుండి ప్రాపర్టీ హామీ తప్పనిసరి..!
- విమాన ప్రమాదాల బాధితులకు సహాయం.. ప్రమాణాలపై అంతర్జాతీయ సదస్సు
- ఈ ఏడాది అమల్లోకి GCC 'గ్రాండ్ టూర్స్ వీసా' ..!
- దుబాయ్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..!
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్