సాదాసీదాగా గిరీశ్ కర్నాడ్ అంత్యక్రియలు..అంతా ఆయన కోరినట్టే!
- June 11, 2019
బెంగుళూరు: ప్రముఖ నటుడు, నాటక రచయిత గిరీశ్ కర్నాడ్ కోరుకున్నట్లుగానే కుటుంబ సభ్యులు ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన కర్నాడ్ సోమవారం ఉదయం కర్ణాటకలోని తన నివాసంలో కన్నుమూశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో కర్నాడ్కు అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. ఐతే ఇందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. కేవలం కుటుంబీకులు, సన్నిహితుల సమక్షంలో స్థానికి స్మశాన వాటికలో అంత్యక్రియలను నిర్వహించారు.
తాను చనిపోయాక సాదాసీదాగా కార్యక్రమాలు నిర్వహించాలని కర్నాడ్ తమతో ముందే చెప్పినట్లు కుటుంబీకులు మీడియా ద్వారా వెల్లడించారు. అభిమానుల సందర్శనార్ధం భౌతికాయాన్ని కూడా ఉంచలేదు. అంతిమయాత్ర సమయంలో అభిమానులు, పోలీసు బలగాలు వెంటరావడం వంటివి వద్దని కర్నాడ్ చెప్పారట. అందుకే ఆయన కోరుకున్నట్లుగానే అంత్యక్రియలను నిర్వహించారు.
తాజా వార్తలు
- కువైట్ పై డ్రోన్ దాడి విఫలం.. గగనతలంలోనే కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- భారతీయులను వీసా లేకుండా థాయిలాండ్ కు వెళ్లొచ్చు
- AP విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు..
- అబుదాబిలో త్వరలో నెలవారీ ఇంటి అద్దె చెల్లింపు సౌకర్యం..
- అబ్బాసియా జ్యువెలరీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు..!!
- బహ్రెయిన్పై దాడుల వేళ హింసాత్మక ఘటనలు.. 10 మందికి జైలుశిక్ష..!!
- దివంగత ఫాదర్ అమీర్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం..!!
- అజ్మాన్ కార్నిష్ టవర్స్లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్లపై దాడులు..ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు..!!
- స్టేట్ రెవెన్యూ చట్టానికి సౌదీ ఆమోదం..విదేశీయులకు కొత్త ట్రైనింగ్ వీసా..!!







