సాదాసీదాగా గిరీశ్ కర్నాడ్ అంత్యక్రియలు..అంతా ఆయన కోరినట్టే!
- June 11, 2019
బెంగుళూరు: ప్రముఖ నటుడు, నాటక రచయిత గిరీశ్ కర్నాడ్ కోరుకున్నట్లుగానే కుటుంబ సభ్యులు ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన కర్నాడ్ సోమవారం ఉదయం కర్ణాటకలోని తన నివాసంలో కన్నుమూశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో కర్నాడ్కు అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. ఐతే ఇందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. కేవలం కుటుంబీకులు, సన్నిహితుల సమక్షంలో స్థానికి స్మశాన వాటికలో అంత్యక్రియలను నిర్వహించారు.
తాను చనిపోయాక సాదాసీదాగా కార్యక్రమాలు నిర్వహించాలని కర్నాడ్ తమతో ముందే చెప్పినట్లు కుటుంబీకులు మీడియా ద్వారా వెల్లడించారు. అభిమానుల సందర్శనార్ధం భౌతికాయాన్ని కూడా ఉంచలేదు. అంతిమయాత్ర సమయంలో అభిమానులు, పోలీసు బలగాలు వెంటరావడం వంటివి వద్దని కర్నాడ్ చెప్పారట. అందుకే ఆయన కోరుకున్నట్లుగానే అంత్యక్రియలను నిర్వహించారు.
తాజా వార్తలు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..









