ఈ ఏడాది హజ్‌ నిర్వహించనున్న 200000 మందికి పైగా భారతీయులు

- June 11, 2019 , by Maagulf
ఈ ఏడాది హజ్‌ నిర్వహించనున్న 200000 మందికి పైగా భారతీయులు

ఈ ఏడాది హజ్‌ నిర్వహించేందుకు 200000 మందికి పైగా అవకాశం పొందనున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు యూనియన్‌ మినిస్టర్‌ ఫర్‌ మైనారిటీ ఎఫైర్స్‌ ముక్తార్‌ అబ్బాస్‌ నక్వి ఓ ప్రకటన విడుదల చేశారు. హజ్‌ పెర్ఫామ్‌ చేయనున్నవారిలో 48 శాతం మహిళలే కావడం గమనార్హం. దేశంలోని 21 పాయింట్స్‌ నుంచి 500 విమానాల ద్వారా వీరంతా మక్కాకి పయనమవుతారు. ముంబైలో హజ్‌ హౌస్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో నక్వి మాట్లాడుతూ, హజ్‌ కమిటీ ద్వారా 150,000 మంది ఫిలిగ్రిమ్స్‌ ప్రయాణించనున్నారనీ, 60,000 మంది ప్రైవేట్‌ టూర్‌ ఆపరేటర్స్‌ ద్వారా మక్కా వెళ్ళనున్నారని, మొత్తం 725 మంది ప్రైవేట్‌ టూర్‌ ఆపరేటర్స్‌ హజ్‌ ఫిలిగ్రిమ్‌సని మక్కా చేరచనున్నాయని తెలిపారు. ఫిలిగ్రిమ్స్‌ భద్రతే ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యత అని నఖ్వీ వివరించారు.   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com