కారులోంచి చెత్త విసిరేస్తే 1,000 జరీమానా, 6 బ్లాక్ పాయింట్స్
- June 13, 2019
అబుదాబీ పోలీసులు, క్యాపిటల్ ఎన్విరాన్మెంట్ని కాపాడే విషయంలో వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలనీ, ఉల్లంఘనలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కారులోంచి చెత్తని రోడ్లపై విసిరేసేవారికి 1000 దిర్హామ్ల జరీమానాతోపాటు, 6 బ్లాక్ పాయింట్స్ కూడా విధిస్తామని పేర్కొన్నారాయన. డ్రైవర్ లేదా ప్యాసింజర్ ఈ చర్యలకు పాల్పడినా, వాహనదారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు రోడ్డు ప్రమాదాలకు దారి తీస్తాయని పేర్కొన్నారు అబుదాబీ పోలీసులు. ట్రాఫిక్ పెట్రోల్స్, స్మార్ట్ సిస్టమ్స్ ఎప్పటికప్పుడు వాహనదారుల బిహేవియర్ని గమనిస్తాయని ఉల్లంఘనుల్ని గుర్తించడం జరుగుతుందని అబుదాబీ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







