కారులోంచి చెత్త విసిరేస్తే 1,000 జరీమానా, 6 బ్లాక్ పాయింట్స్
- June 13, 2019
అబుదాబీ పోలీసులు, క్యాపిటల్ ఎన్విరాన్మెంట్ని కాపాడే విషయంలో వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలనీ, ఉల్లంఘనలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కారులోంచి చెత్తని రోడ్లపై విసిరేసేవారికి 1000 దిర్హామ్ల జరీమానాతోపాటు, 6 బ్లాక్ పాయింట్స్ కూడా విధిస్తామని పేర్కొన్నారాయన. డ్రైవర్ లేదా ప్యాసింజర్ ఈ చర్యలకు పాల్పడినా, వాహనదారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు రోడ్డు ప్రమాదాలకు దారి తీస్తాయని పేర్కొన్నారు అబుదాబీ పోలీసులు. ట్రాఫిక్ పెట్రోల్స్, స్మార్ట్ సిస్టమ్స్ ఎప్పటికప్పుడు వాహనదారుల బిహేవియర్ని గమనిస్తాయని ఉల్లంఘనుల్ని గుర్తించడం జరుగుతుందని అబుదాబీ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!