కారులోంచి చెత్త విసిరేస్తే 1,000 జరీమానా, 6 బ్లాక్ పాయింట్స్
- June 13, 2019
అబుదాబీ పోలీసులు, క్యాపిటల్ ఎన్విరాన్మెంట్ని కాపాడే విషయంలో వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలనీ, ఉల్లంఘనలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కారులోంచి చెత్తని రోడ్లపై విసిరేసేవారికి 1000 దిర్హామ్ల జరీమానాతోపాటు, 6 బ్లాక్ పాయింట్స్ కూడా విధిస్తామని పేర్కొన్నారాయన. డ్రైవర్ లేదా ప్యాసింజర్ ఈ చర్యలకు పాల్పడినా, వాహనదారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు రోడ్డు ప్రమాదాలకు దారి తీస్తాయని పేర్కొన్నారు అబుదాబీ పోలీసులు. ట్రాఫిక్ పెట్రోల్స్, స్మార్ట్ సిస్టమ్స్ ఎప్పటికప్పుడు వాహనదారుల బిహేవియర్ని గమనిస్తాయని ఉల్లంఘనుల్ని గుర్తించడం జరుగుతుందని అబుదాబీ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









