ఇల్లీగల్ ట్యాక్సీ: 3,000 జరీమానా, 24 ట్రాఫిక్ పాయింట్స్
- June 14, 2019అబుధాబి: ఇల్లీగల్ ట్యాక్సీలను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని అబుదాబీ పోలీస్ పేర్కొంది. 2019 తొలి క్వార్టర్లో 1,573 ఇల్లీగల్ ట్యాక్సీలను సీజ్ చేయడం జరిగిందని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ట్రాఫిక్ పోలీస్తో కలిసి ట్రాన్స్పోర్ట్ అథారిటీస్కి చెందిన అధికారులు అండర్ కవర్ ఆపరేషన్లు నిర్వహించి ఇల్లీగల్ ట్యాక్సీలను పట్టుకోగలిగారు. ఇల్లీగల్ ట్యాక్సీలకు 3,000 దిర్హామ్ల జరీమానాతోపాటు, వారిపై 24 ట్రాఫిక్ పాయింట్లు కూడా విధిస్తామని అబుదాబీ పోలీస్ ట్రాన్స్పోర్ట్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ ముబారక్ అవాద్ బిన్ మహిరుమ్ చెప్పారు. ఇల్లీగల్ ట్యాక్సీలు నిర్వహిస్తున్నవారిలో కొందరికి లైసెన్సులు కూడా లేవని ఆయన వివరించారు. ఎక్కువగా లేబరర్స్ ఈ ఇల్లీగల్ ట్యాక్సీలను తక్కువ ధర కారణంగా ఎంచుకుంటున్నారని ఆయన చెప్పారు. ఆసియాకి చెందిన వ్యక్తులే ఎక్కువగా వీటిని నడుపుతున్నారని చెప్పారు కల్నల్ ముబారక్ అవాద్.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..