ముస్సాఫాలో ఇండియన్ మిషన్ సర్వీసెస్
- June 15, 2019అబుధాబిలోని ఇండియన్ ఎంబసీ, అబుదాబీ మలయాళీ సమాజం నుంచి కాన్సులర్ సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. ముస్సాఫా ఇండస్ట్రియల్ ఏరియాలో వున్న ఒకే ఒక్క రిజిస్టర్డ్ ఇండియన్ అసోసియేషన్ ఇది. వేలాది మంది బ్లూ కాలర్ వర్కర్స్, వారి కుటుంబాలకు ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందని అధికారులు అంటున్నారు. పాస్పోర్ట్ రెన్యువల్, అటెస్టేషన్ ఆఫ్ సర్టిఫికెట్స్ అలాగే వీసా సంబంధిత పేపర్ వర్క్స్ కోసం ఇకపై సుదూరంలో వున్న సిటీకి వెళ్ళాల్సిన అవసరం వుండదు. ఈ ఇనీషియేటివ్కి అప్రూవల్ లభించిందనీ, యూఏఈలో భారత రాయబారి నవదీప్ సింగ్ సూరి ప్రాథమికంగా ఈ మేరకు అప్రూవల్ ఇచ్చారని ఎంబసీ కౌన్సెలర్ రాజమురుగన్ చెప్పారు. ఈ ఆదివారం ఎంబసీకి చెందిన అధికారులు అబుధాబి మలయాళ సమాజంను సందర్శించి, ఇక్కడి వసతుల్ని తెలుసుకుంటారని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు