బస్సులో ఊపిరాడక చనిపోయిన చిన్నారి
- June 17, 2019
దుబాయ్లో ఓ చిన్నారి బస్సులో ప్రాణాలు కోల్పోయాడు. సెంటర్ ఫర్ మొమొరైజింగ్ కురాన్కి చెందిన బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. అల్ కోజ్ ఏరియాలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే, బాలుడు బస్సులో వుండిపోయిన విషయాన్ని బస్ డ్రైవర్, సూపర్వైజర్ గుర్తించకుండానే డోర్స్ క్లోజ్ చేయడంతో 9 గంటలపాటు బస్సులో చిన్నారి వుండిపోయాడు. ఈ క్రమంలో బాలుడు ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు డ్రైవర్నీ, సూపర్వైజర్నీ ప్రశ్నిస్తున్నారు. బాలుడ్ని భారతదేశంలోని కేరళకు చెందిన మొహమ్మద్ ఫర్హాన్గా గుర్తించారు. తన సోదరి పెళ్ళి కోసం చిన్నారి తన కుటుంబంతో కలిసి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. బాలుడి తండ్రి ఫైజల్ కెపి అనీ కేరళకు చెందినవారనీ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు







