బస్సులో ఊపిరాడక చనిపోయిన చిన్నారి
- June 17, 2019దుబాయ్లో ఓ చిన్నారి బస్సులో ప్రాణాలు కోల్పోయాడు. సెంటర్ ఫర్ మొమొరైజింగ్ కురాన్కి చెందిన బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. అల్ కోజ్ ఏరియాలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే, బాలుడు బస్సులో వుండిపోయిన విషయాన్ని బస్ డ్రైవర్, సూపర్వైజర్ గుర్తించకుండానే డోర్స్ క్లోజ్ చేయడంతో 9 గంటలపాటు బస్సులో చిన్నారి వుండిపోయాడు. ఈ క్రమంలో బాలుడు ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు డ్రైవర్నీ, సూపర్వైజర్నీ ప్రశ్నిస్తున్నారు. బాలుడ్ని భారతదేశంలోని కేరళకు చెందిన మొహమ్మద్ ఫర్హాన్గా గుర్తించారు. తన సోదరి పెళ్ళి కోసం చిన్నారి తన కుటుంబంతో కలిసి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. బాలుడి తండ్రి ఫైజల్ కెపి అనీ కేరళకు చెందినవారనీ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- ఎయిర్ ఇండియా పై రూ.80 లక్షల ఫైన్