ఖరీఫ్ సీజన్: మవసలాట్ డిస్కౌంట్స్, డబుల్ ట్రిప్స్
- June 18, 2019మస్కట్:ఖరీఫ్ సీజన్ని సెలబ్రేట్ చేసే క్రమంలో మవసలాట్, సలాలాకి ట్రిప్పుల సంఖ్యను డబుల్ చేసింది. ఆటమ్న్ సీజన్ కోసం సరికొత్త నిర్ణయాల్ని మవసలాత్ తీసుకుంది. ఫ్యామిలీ బుకింగ్స్పై స్పెషల్ డిస్కౌంట్స్ ఇవ్వనున్నట్లు సంస్థ పేర్కొంది. ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, విలాయత్ ఆఫ్ సలాలాలో న్యూ ఇంటర్నల్ రూట్ మీదుగా బస్సులు వెళతాయని తెలుస్తోంది. మస్కట్ - సలాలా లైన్కి 3 నుంచి 7 వరకు ట్రిప్పుల్ని పెంచామనీ, 700 సీట్లతో ప్రయాణీకులు సలాలాకి వెళ్ళేందుకు వీలుందని అధికారులు తెలిపారు. సలాలా ఎయిర్పోర్ట్ నుంచి సహాల్ లిట్టిన్ మీదుగా సిటీ సెంటర్కి చేరుకుంటాయి. ఫ్యామిలీ బుకింగ్స్ 25 ఒమన్ రియాల్స్ నుంచి ప్రారంభమవుతాయి. ఒక్కో వ్యక్తికి పూర్తి ప్రయాణం 10 ఒమన్ రియాల్స్ ఖర్చుతో వుంటుంది. 2 ఏళ్ళలోపు చిన్నారులకు ప్రయాణం ఉచితం.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?