ట్రాఫిక్ ఉల్లంఘనలు ఇక్కడే అధికం
- January 04, 2016
షార్జాలోని అల్ ఒరోబా, బుహారియా కోర్నిచె, జమాల్ అబ్దుల్ నాజర్ మరియు అల్ వాహ్దా స్ట్రీట్స్లో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు ఎక్కువగా పాల్పడుతున్నట్లు ట్రాఫిక్ విభాగం అధికారులు వెల్లడించారు. షార్జాలో గత ఏడాది మొత్తం 13,691 మంది మోటరిస్టులకు ఫైన్ విధించారు. వీరంతా మొబైల్ ఫోన్లు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్ని నడిపినట్లు పోలీసు అధికారులు చెప్పారు. షార్జాలో 200,000 కార్లు రిజిస్టర్ అయి ఉన్నాయనీ, యాక్సిడెంట్లు ముఖ్యంగా రోడ్లపై నడుస్తున్నవారిని ఢీ క్టొడం ద్వారా నెలకు 8 నుంచి 10 మంది మృత్యువాత పడ్తున్నట్లు చెప్పారు. సార్జా అల్ ధాయిద్ మలిహా, షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ రోడ్, ఎమిరేట్స్ రోడ్లలో ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. 18 నుంచి 26 ఏళ్ళ మధ్య వయస్కులు ఎక్కువగా ప్రమాదాలకు కారణమవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. యాక్సిడెంట్లలో 60 శాతం వరకు ప్రాణాలు కోల్పోవడానికి కారణమవుతున్నాయి. ఆరు ప్రధాన కూడళ్ళ వద్ద 24 రాడార్లను ఏర్పాటు చేయాలని, తద్వారా రెడ్ సిగ్నల్ జంప్ చేసేవారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని పోలీసు వర్గాలు చెప్పాయి. మొబైల్ ఫోన్ వాడుతూ, వాహనాలు నడుపుతున్నవారికి నాలు బ్లాక్ పాయింట్స్తోపాటు, 200 దిర్హామ్ల ఫైన్ విధించడం జరుగుతుంది.
తాజా వార్తలు
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం







