ఇరాన్పై అమెరికా సైబర్ దాడులు
- June 24, 2019వాషింగ్టన్ : మిడిల్ ఈస్ట్ లో చమురు కోసం యుద్ధాలు చేసే అమెరికా, తాజాగా ఇరాన్పై సైబర్ దాడులకు తెగబడింది. ఇరాన్ గగనతలంలోకి చొరబడిన అమెరికా డ్రోన్ను ఆ దేశం కూల్చివేయడంతో కుతకుతలాడుతున్న ట్రంప్ సర్కార్ సైనిక చర్యకు యత్నించి, చివరి నిమిషంలో దాని నుంచి వెనక్కి తగ్గింది. ఆ వెంటనే అంటే గురువారం రాత్రి నుంచే ఇరాన్ క్షిపణి నియంత్రణ కంప్యూటర్ వ్యవస్థపై సైబర్ దాడులు మొదలెట్టింది. పేరు తెలపడానికి ఇష్టపడని ఉన్నతాధికారులు వాషింగ్టన్ పోస్ట్ పత్రికతో మాట్లాడుతూ, ట్రంప్ ఆదేశాల మేరకే అమెరికన్ సెంట్రల్ కమాండ్, సైబర్ కమాండ్ సమన్వయంతో ఇరాన్ సైనిక కంప్యూటర్ వ్యవస్థపై దాడులు ప్రారంభించినట్లు చెప్పారు. ఈ దాడులపై ఇరాన్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు