కజకిస్థాన్:ఆర్మీ ఆయుధ డిపోలో భారీ పేలుళ్లు
- June 25, 2019ఆర్మీ ఆయుధ డిపోలో సోమవారం చోటుచేసుకున్న వరుస పేలుళ్లతో కజకిస్థాన్ వణికిపోయింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో గాయపడగా, 40 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉత్తర కజక్లోని ఆర్మీ ఆయుధ డిపోలో సోమవారం ఈ పేలుళ్లు సంభవించినట్టు అధికారులు తెలిపారు. డిపోలో అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో అందులోని ఆయుధాలు పెద్ద శబ్దంతో పేలిపోయినట్టు కజకిస్థాన్ రక్షణ శాఖ పేర్కొంది. పేలుళ్ల కారణంగా ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. భారీ పేలుడు సంభవించినప్పటికీ ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన 50 మందికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. అయితే, తీవ్రంగా గాయపడిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయుధ డిపోలో మంటలు ఎలా చెలరేగాయన్నది తెలియరాలేదు. ఈ విషయమై దర్యాప్తు జరుపుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..