భవనాల్లో అగ్ని ప్రమాదం: 1,300 ఘటనల నమోదు
- June 28, 2019
మస్కట్: ప్రతి యేడాదీ భవనాల్లో అగ్ని ప్రమాదాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ వెల్లడించింది. 2016లో మొత్తం 1100 రెసిడెన్షియల్ ఫైర్స్ చోటు చేసుకోగా, 2017లో ఈ సంఖ్య 1234గా నమోదయ్యింది. 2018లో ఈ సంఖ్య 1335గా నమోదయ్యింది. వైరింగ్లో లోపాలు, ఎలక్ట్రిసిటీ పోర్ట్స్కి సంబంధించి ఓవర్ లోడ్, ఎలక్ట్రానిక్ పరికరాల్ని ఎక్కువ సేపు వినియోగించడం, సరిగ్గా సర్వీసింగ్ చేయించకపోవడం వంటివి ఈ ఘటనలకు కారణంగా పిఎసిడిఎ పేర్కొంది. తడి చేతులతో ఎలక్ట్రానిక్ పరికరాల్ని తాకరాదనీ, వినియోగించిన వెంటనే వాటిని జాగ్రత్త చేయడం, అలాగే విరివిగా సర్వీసింగ్ చేయించడం వంటి చర్యల ద్వారా ప్రమాదాల్ని తగ్గించవచ్చని పిఎసిడిఎ వర్గాలు సూచిస్తున్నాయి.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!