ముంబయిలో ఇకపై ట్రాఫిక్ పోలీసులకు ఫైన్ కట్టాలంటే డెబిట్/క్రెడిట్ కార్డు..
- January 05, 2016
ట్రాఫిక్ నిబంధనలు అధిగమించి ట్రాఫిక్ పోలీసులకు చిక్కితే ఫైన్ కట్టాల్సిందే. ఫైన్ వేస్తే మన పర్సులో ఉన్న డబ్బులు తీసి కట్టేస్తాం. అయితే ముంబయిలో ఇకపై ట్రాఫిక్ పోలీసులకు ఫైన్ కట్టాలంటే డెబిట్/క్రెడిట్ కార్డు ఉండాల్సిందే. ఎందుకంటే త్వరలో ముంబయి ట్రాఫిక్ పోలీసులకు స్వైప్ మిషన్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఇకపై వాహనదారులను నుంచి జరిమానా వసూలు చేయాలంటే వారి డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను తీసుకుని ఈ మిషన్లలో స్వైప్ చేస్తారు అంతే. ఈ విధానం ఈనెల 12 నుంచి అమల్లోకి రానుంది. జనవరి 12న రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే వేల సంఖ్యలో స్వైప్ మిషన్లను ట్రాఫిక్ పోలీసులకు అందించారు. జనవరి 12 నుంచి నిబంధనలను అతిక్రమించే వాహనదారులకు ఈచలాన్ ద్వారా జరిమానా విధించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. తక్షణం జరిమానా చెల్లించలేని వారికి 15రోజుల్లోగా ఆన్లైన్ ద్వారా చెల్లించేందుకు అవకాశం కల్పించనున్నారు. గడువు దాటితే మాత్రం రోజుకు రూ.10అదనంగా చెల్లించాల్సిందే. ట్రాఫిక్ విభాగంలో జరుగుతున్న అవినీతికి అడ్డుకట్ట వేసేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









