ముంబయిలో ఇకపై ట్రాఫిక్ పోలీసులకు ఫైన్ కట్టాలంటే డెబిట్/క్రెడిట్ కార్డు..
- January 05, 2016ట్రాఫిక్ నిబంధనలు అధిగమించి ట్రాఫిక్ పోలీసులకు చిక్కితే ఫైన్ కట్టాల్సిందే. ఫైన్ వేస్తే మన పర్సులో ఉన్న డబ్బులు తీసి కట్టేస్తాం. అయితే ముంబయిలో ఇకపై ట్రాఫిక్ పోలీసులకు ఫైన్ కట్టాలంటే డెబిట్/క్రెడిట్ కార్డు ఉండాల్సిందే. ఎందుకంటే త్వరలో ముంబయి ట్రాఫిక్ పోలీసులకు స్వైప్ మిషన్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఇకపై వాహనదారులను నుంచి జరిమానా వసూలు చేయాలంటే వారి డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను తీసుకుని ఈ మిషన్లలో స్వైప్ చేస్తారు అంతే. ఈ విధానం ఈనెల 12 నుంచి అమల్లోకి రానుంది. జనవరి 12న రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే వేల సంఖ్యలో స్వైప్ మిషన్లను ట్రాఫిక్ పోలీసులకు అందించారు. జనవరి 12 నుంచి నిబంధనలను అతిక్రమించే వాహనదారులకు ఈచలాన్ ద్వారా జరిమానా విధించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. తక్షణం జరిమానా చెల్లించలేని వారికి 15రోజుల్లోగా ఆన్లైన్ ద్వారా చెల్లించేందుకు అవకాశం కల్పించనున్నారు. గడువు దాటితే మాత్రం రోజుకు రూ.10అదనంగా చెల్లించాల్సిందే. ట్రాఫిక్ విభాగంలో జరుగుతున్న అవినీతికి అడ్డుకట్ట వేసేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ