ముంబయిలో ఇకపై ట్రాఫిక్ పోలీసులకు ఫైన్ కట్టాలంటే డెబిట్/క్రెడిట్ కార్డు..
- January 05, 2016
ట్రాఫిక్ నిబంధనలు అధిగమించి ట్రాఫిక్ పోలీసులకు చిక్కితే ఫైన్ కట్టాల్సిందే. ఫైన్ వేస్తే మన పర్సులో ఉన్న డబ్బులు తీసి కట్టేస్తాం. అయితే ముంబయిలో ఇకపై ట్రాఫిక్ పోలీసులకు ఫైన్ కట్టాలంటే డెబిట్/క్రెడిట్ కార్డు ఉండాల్సిందే. ఎందుకంటే త్వరలో ముంబయి ట్రాఫిక్ పోలీసులకు స్వైప్ మిషన్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఇకపై వాహనదారులను నుంచి జరిమానా వసూలు చేయాలంటే వారి డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను తీసుకుని ఈ మిషన్లలో స్వైప్ చేస్తారు అంతే. ఈ విధానం ఈనెల 12 నుంచి అమల్లోకి రానుంది. జనవరి 12న రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే వేల సంఖ్యలో స్వైప్ మిషన్లను ట్రాఫిక్ పోలీసులకు అందించారు. జనవరి 12 నుంచి నిబంధనలను అతిక్రమించే వాహనదారులకు ఈచలాన్ ద్వారా జరిమానా విధించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. తక్షణం జరిమానా చెల్లించలేని వారికి 15రోజుల్లోగా ఆన్లైన్ ద్వారా చెల్లించేందుకు అవకాశం కల్పించనున్నారు. గడువు దాటితే మాత్రం రోజుకు రూ.10అదనంగా చెల్లించాల్సిందే. ట్రాఫిక్ విభాగంలో జరుగుతున్న అవినీతికి అడ్డుకట్ట వేసేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







