హౌతీ ద్రోన్స్ని కూల్చేసిన అరబ్ కోలిషన్
- July 01, 2019సౌదీ అరేబియా లక్ష్యంగా యెమెన్ నుంచి హౌతీ తీవ్రవాదులు సంధించిన రెండు డ్రోన్లను కూల్చివేసినట్లు సౌదీ నేతృత్వంలోని అరబ్ కోలిషన్ వెల్లడించింది. కోలిషన్ అధికార ప్రతినిథి కల్నల్ టుర్కి అల్ మాల్కి మాట్లాడుతూ, సదరన్ ప్రావిన్స్ ఆఫ్ అసిర్ వైపు రాత్రి 11.45 నిమిషాల సమయంలో రెండు డ్రోన్లు సివిలియన్లే లక్ష్యంగా దూసుకొచ్చినట్లు చెప్పారు. డ్రోన్లను విజయవంతంగా కూల్చేయడం జరిగిందనీ, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని కల్నల్ మాల్కి చెప్పారు. ఖసాఫ్ 2కె డ్రోన్స్ ద్వారా సౌదీలోని అభా అలాగే జిజాన్ ఎయిర్పోర్ట్లను టార్గెట్ చేసినట్లు హౌతీలకు చెందిన న్యూస్ ఛానల్ అల్ మసిరాహ్ వెల్లడించింది. ఇరాన్ మద్దతుతో హౌతీ తీవ్రవాదులు, సౌదీపై డ్రోన్లు, మిస్సైల్స్తో దాడులకు తెగబడుతున్నారు. జూన్ 12న జరిగిన మిస్సైల్ దాడిలో 26 మంది సివిలియన్స్ గాయపడ్డారు. జూన్ 23న జరిగిన దాడిలో ఒకరు ప్రాణాలు కోల&్పగా, 21 మందికి గాయాలయ్యాయి.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్