సార్సా దాడిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్
- July 02, 2019
తెలంగాణలోని కుమ్రం భీం జిల్లా సార్సాలలో అటవీ శాఖ అధికారులపై జరిగిన దాడిని కేంద్రం సీరియస్గా తీసుకుంది. మహిళా అధికారిపై జరిపిన దాడిని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జవదేకర్ ఖండించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు కేంద్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జావదేకర్ స్పష్టంచేశారు. రాజ్యసభలో కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ లేవనెత్తిన అంశంపై జావదేకర్ స్పందించారు. ఇలాంటి ఘటనల్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టంచేశారు. వాటిని నియంత్రించేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత దీనిపై ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.
సార్సాలలో ఆదివారం అటవీశాఖ అధికారులపై అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు జడ్పీ వైస్ ఛైర్మన్ కృష్ణ తన అనుచరులతో దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో అటవీశాఖ రేంజ్ అధికారిణి అనిత తీవ్రంగా గాయపడ్డారు. ఆమె ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడి ఘటనలో ఇప్పటికే 13మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు పోలీసు అధికారులను కూడా సస్పెండ్ చేశారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!