ఇక్కడ నివసిస్తే నెలకు రూ. 40,000..
- July 04, 2019గ్రీస్:మా ద్వీపానికి వస్తే రూ.40 వేలు ఇస్తామంటున్నారు అంటీకైథెరా ద్వీపానికి చెందిన మేయర్. గ్రీస్ దేశంలోని అంటీకైథెరా ద్వీపంలో నివసించే వారికి సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతోంది. ఇది ఇలానే కంటిన్యూ అయితే ద్వీపం కనుమరుగైపోతుంది. ద్వీప అందాలను కాపాడుకోవాలంటే జనం సంచారం ఉండాలని భావిస్తోంది ప్రభుత్వం. ఇప్పుడు అక్కడ కేవలం 24 మంది మాత్రమే నివసిస్తున్నారు. వేసవి కాలం వస్తే ద్వీపాన్ని సందర్శించే పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది కానీ మాములు రోజుల్లో అయితే మనుషులే కనిపించరు.
మధ్యధరా సముద్రంలోని క్రెటా, కైథిరా దీవుల మధ్య ఉన్న అంటీకైథెరా ద్వీపంలో ఆహారం తక్కువగా దొరుకుతుంది. శీతాకాలంలో ద్వీప అందాలు పర్యాటకులను మైమరపిస్తాయని ద్వీప మేయర్ ఆండ్రియాస్ చార్చలకిస్ గ్రీకు వెబ్సైట్కు చెప్పారు. ద్వీపంలో నివసించే వారి సంఖ్యను పెంచే దిశగా చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే ఈ ద్వీపంలో నివసించడానికి ఎవరైనా ఆసక్తి చూపితే ఇక్కడ ఉంటున్నందుకు వారికి నెలకు 450 పౌండ్లు (రూ.40 వేలు) చెల్లిస్తామంటోంది గ్రీస్ దేశం. ద్వీపాన్ని కాపాడుకోవాలని, దానికి పునర్వైభవాన్ని తీసుకు రావాలనే వారి ప్రయత్నం అభినందనీయం అంటూ పలువురు గ్రీస్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ