భారత్ పై భగ్గుమంటున్న ట్రంప్
- July 12, 2019
భారత్-అమెరికా దేశాల మధ్య టారిఫ్ వార్ ఓ వైపు సాగుతుండగా..దీనికి ఆజ్యం పోస్తూ.. యుఎస్ లోని మల్టీనేషనల్ రిటెయిల్ కార్పొరేషన్..వాల్ మార్ట్… ఇండియామీద సరికొత్త ఆరోపణలు చేసింది.. ఈ-కామర్స్ కు సంబంధించి భారత నూతన పెట్టుబడి నిబంధనలు కఠినతరంగా ఉన్నాయని, తమ వాణిజ్య సంబంధాలను దెబ్బ తీసేవిగా ఉన్నాయని అమెరికాకు ఫిర్యాదు చేసింది. ఈ సంస్థ గత జనవరిలోనే ఈ మేరకు ఫిర్యాదు చేసినప్పటికీ.. తాజాగా ఇందుకు సంబంధించిన డాక్యుమెంటును రాయిటర్స్ కు అందజేసింది. ఇండియా తన కొత్త టారిఫ్ నిబంధనలను ఫిబ్రవరి 1 నుంచి అమలు చేసిన సంగతి తెలిసిందే. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 28 వస్తువులపై సుంకాలను పెంచింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం భగ్గుమన్నారు. భారత చర్య తమను ఆందోళనకు గురి చేస్తోందని, ఈ-కామర్స్ రెగ్యులేషన్స్ అత్యంత హార్ష్ గా ఉన్నాయని వాల్ మార్ట్ పేర్కొంది. భారత-అమెరికా దేశాలమధ్య ఈ నిబంధనలు కీలకంగా మారిన విషయాన్ని ఈ సంస్థ గుర్తు చేసింది. గతంలో ఇది ఈ-కామర్స్ జెయింట్ ఫ్లిప్ కార్ట్ పై 16 బిలియన్ యుఎస్ డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. ఈ సొమ్ము వాల్డ్ లోనే ఒక సంస్థ మరొక దానిపై ఇన్వెస్ట్ చేసిన అత్యధికమైనదిగా పేర్కొంటున్నారు. రిటెయిల్ మార్కెట్లో వాల్ మార్ట్.. ఇండియాతో మంచి వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తూ వస్తోంది. అయితే అమెరికన్ సరుకులపై భారత ప్రభుత్వం సుంకాలను పెంచడంతో దాని ప్రభావం ఈ సంస్థపై కూడా పడింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..