కరుణ్ జోహార్ దృష్టి సౌత్ సినిమాలపై..
- January 05, 2016
బాహుబలి హిందీ వెర్షన్ కు నిర్మాతగా వ్యవహరించి,భారీగా సక్సెస్ అయిన నిర్మాత కరుణ్ జోహార్. ఇప్పుడు ఆయన దృష్టి మన సౌత్ సినిమాలపై పడింది. సౌత్ సినిమాలను హిందీలో బాగా ఆదరిస్తూండటం గమనించిన ఆయన మరో సౌత్ సినిమాని రీమేక్ చేసే పనిలో పడ్డారు. ఆ సినిమా మరేదో కాదు...మణిరత్నం డైరక్షన్ లో, మలయాళీ హీరో దుల్హర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటించిన సినిమా 'ఓకే బంగారం'. ఈ సినిమాను ఇప్పుడు హిందీలో నిర్మించేందుకు కరణ్ జోహార్ సన్నాహాలు మొదలుపెట్టారు. గతంలో మణిరత్నం వద్ద సహకార దర్శకుడిగా పనిచేసిన షాద్ ఆలీ దీనికి దర్శకత్వం వహిస్తాడు.మణిరత్నంకు బ్రేక్ యిచ్చిన సినిమా 'ఓ కాదల్ కన్మణి'.ముంబై లాంటి సిటీల్లో యువత ఎలా ఉంటోందో, అందుకు పెద్దల సహకారం ఎలా ఉంటుందో వివరిస్తూ తీసిన సినిమా ఇది. ఈ సినిమాలో హీరో,హీరోయిన్స్ కి సహయకులుగా ప్రకాష్రాజ్, లీలా శాంసన్ నటించారు.మణిరత్నం సినిమాను హిందీలో తీయడం తనకు గౌరవంగా వుందని కరణ్జోహార్ తెలుపడం విశేషం. ఈ హిందీ వర్షన్లో ఆదిత్యరాయ్ కపూర్, శ్రద్ధాకపూర్ జంటగా నటించనున్నారని సమాచారం.కరణ్జోహార్ ప్రస్తుతం ''అయే దిల్హై ముష్కిల్'' సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలో రణబీర్కపూర్, అనుష్కశర్మ, ఐశ్వర్యరాయ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.అలాగే మణిరత్నం కొత్త సినిమా విషయానికి వస్తే...స్క్రిప్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. పనులు పూర్తవగానే ఈ సినిమా సెట్స్కు వెళ్లనుంది. ఈ సినిమాకు సంబందించి, ఇతర సాంకేతిక నిపునుల కోసం చర్చలు జరుగుతున్నాయి
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









